ముషీరాబాద్, జనవరి 11: అనారోగ్యంతో బాధపడుతూ వివిధ దవాఖానల్లో చికిత్స పొందిన పలువురికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని (చెక్కులు) ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మంగళవారం పంపిణీ చేశారు. అడిక్మెట్, కవాడిగూడ డివిజన్లకు చెందిన లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి ఆరుగురికి రూ.2.8 లక్షల విలుజేసే చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ముఠా జయసింహ, బి.శ్రీనివాస్రెడ్డి, సురేందర్, శ్యామ్సుందర్, మాధవ్, నేత శ్రీనివాస్, సయ్యద్ అస్లాం, బొట్టు శ్రీనివాస్, రవియాదవ్, ఖలీల్, జెల్ల భిక్షపతి, అహ్మద్, అబ్బు, శ్రీధర్రెడ్డి, గురుదీప్సింగ్, హరీశ్, అజయ్, రాజు తదితరులు పాల్గొన్నారు.
బస్తీ దవాఖాన ఏర్పాటు చేయాలి
గాంధీనగర్ డివిజన్లోని శాంతి యువజన సంఘం బస్తీలో బస్తీ దవాఖాన ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు. డివిజన్లోని అరుంధతీనగర్ బస్తీ, ఎస్సార్టీ గ్రౌండ్స్లో బస్తీ దవాఖానలు ఉన్నాయని, దూరంగా ఉండటంతో వెళ్లలేక పోతున్నామని పేర్కొన్నారు. ప్రధానంగా మహిళలు, వృద్ధులు బస్తీ దవాఖానలకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. బస్తీలోని 40 గజాల విలువైన ప్రభుత్వ స్థలంలో భవనం నిర్మించి బస్తీ దవాఖాన ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. బస్తీ దవాఖాన ఏర్పాటు చేయాలని హైదరాబాద్ కలెక్టర్ శర్మన్, ఎమ్మెల్యే ముఠా గోపాల్కు వినతి పత్రం ఇచ్చినట్లు బస్తీ వాసులు తెలిపారు. బస్తీలో ఉన్న ఖాళీ స్థలంలో బస్తీ దవాఖాన నిర్మించాలి బస్తీవాసి, న్యాయవాది సాయి కోరారు. ప్రజలు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ దృష్టికి కూడా సమస్యను తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఆయన సానుకూలంగా స్పదించారని, త్వరలోనే భనవం నిర్మాణంతో పాటు బస్తీ దవాఖాన ఏర్పాటు చర్యలు చేపడుతామంటూ ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు తెలిపారు.
లాల్బహదూర్ శాస్త్రి సేవలు మరువలేం..
లాల్బహదూర్ శాస్త్రి దేశానికి చేసిన సేవలు మరువలేనివని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఆయన ఆశయ సాదనకు యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం భోలక్పూర్ డివిజన్లోని రంగానగర్ లాల్బహదూర్ కమ్యూనిటీ హాల్ వద్ద దివంగత మాజీ ప్రధాని లాల్బహదూర్ శాస్త్రి జయంతిని డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. శాస్త్రి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు నాయకులు ముఠా జయసింహ, బింగి నవీన్కుమార్, జునేద్ బాగ్ధాది, మున్వర్ చాంద్, శ్రీనివాస్, శంకర్గౌడ్, రాజ్, మక్బూల్, నర్సింగరావు, రవీందర్, శ్రావణ్కుమార్, హాజీ పాషా, ప్రవీణ్, జనార్దన్, ఉప్పలయ్య, గోరే తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖ సంఘ సేవకుడు బైరు రామ్మోహన్ మృతి..
ప్రముఖ సంఘ సేవకుడు బైరు రామ్మోహన్ (51) బ్రైన్స్ట్రోక్తో మృతి చెందాడు. సికింద్రాబాద్లోని కిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతూ అతడు మంగళవారం మరణించినట్లు మృతుడి సోదరుడు నిత్యానంద్ తెలిపారు. ఆయనకు భార్య శ్రీసుధ, కుమారుడు వరుణ్, కూతురు వావిక ఉన్నారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్కు విషయం తెలియగానే రామ్మోహన్ పార్థీవ దేహాన్ని సందర్శించి పూల మాలలు వేసి సంతాపం తెలియజేశారు.