మేడ్చల్, జనవరి 9: మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డుకు చెందిన పద్మకు సీఎం సహాయ నిధి నుంచి రూ.60వేల ఆర్థిక సాయం మంజూరైంది. ఇందుకు సంబంధించిన చెక్కును సోమవారం మంత్రి మల్లారెడ్డి లబ్ధిదారురాలికి అందజేశారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ తుడుం గణేశ్, స్థానికులు పాల్గొన్నారు.