ఉప్పల్, నవంబర్ 9 : ప్రజాశ్రేయస్సుకు తమవంతు చేయూతనందిస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. హబ్సిగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. లబ్ధిదారులు ఎన్.శేఖరంకు రూ.2లక్షలు, శ్రీలక్ష్మికి రూ.16 వేలు, లింగానాయక్కు రూ.60 వేలు, మల్లికార్జున్కు రూ.20వేలు, వినయ్కుమార్కు రూ.60 వేలు, శ్రీనివాస్కు రూ.60 వేలు, మల్లేశ్కు రూ.16 వేలు, షాహిన్భానుకు రూ.60 వేలు, బాలాజీకి రూ.40 వేలు, సోమిరెడ్డికి రూ.60 వేలు, భాగ్యకు రూ.38 వేలు, ఐలయ్యకు రూ.44 వేలు, చైతన్యరాజుకు రూ.48 వేల చెక్కులను ఎమ్మెల్యే అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైద్యం కోసం ఇబ్బందులు పడకుండా ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. సీఎం రిలీఫ్ఫండ్ ద్వారా ఎంతోమందికి సహాయ, సహకారాలు అందజేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమానికి సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. ప్రజల ఆశయాలను గుర్తించి, తగిన పథకాలు తీసుకువచ్చారన్నారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చూస్తున్నామని చెప్పారు. కార్యక్రమం లో మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డి, చిలుకానగర్ కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్, మాజీ కార్పొరేటర్లు కొత్తరామారావు, ధన్పాల్రెడ్డి, నేతలు బద్దం భాస్కర్రెడ్డి, గరిక సుధాకర్, డివిజన్ అధ్యక్షులు పల్లా కిరణ్కుమార్రెడ్డి, కాసం మహిపాల్రెడ్డి, మేకల ముత్యంరెడ్డి, సుడుగు మహేందర్రెడ్డి, పల్లె నర్సింగ్రావు, డప్పు గిరిబాబు, డా.చారి, బన్నాల ప్రవీణ్, చింతల నర్సింహారెడ్డి, పిట్టల నరేశ్, తదితరులు పాల్గొన్నారు.