అబ్దుల్లాపూర్మెట్ : సర్టిఫికెట్స్ తెచ్చుకుంటానని కాలేజీకి వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన అబ్ధుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అబ్దుల్లాపూర్ మెట్ గ్రామ పంచాయతీ పరిధిలోని జేఎన్ ఎన్ యూఆర్ ఎం కాలనీకి చెందిన కేతావత్ లచ్చు కుమార్తె కేతవత్ రజిత (21) ఈనెల 17న సర్టిఫికెట్లు తెచ్చుకుంటానని కళాశాలకు వెళ్లింది.
సాయంత్రం అయినా తిరిగి రాలేదు. అందోళనకు చెందిన కుటుంబ సభ్యులు చుట్టు పక్కల ప్రాంతాలలో వెతికినా ఆచూకీ లభించలేదు. యువతి తండ్రి లచ్చు శనివారం అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులకు పిర్యాదు చేశారు.