కాచిగూడ, సెప్టెంబర్ 12: సేవా భావంతో పనిచేసినప్పుడే సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని, ఆ దిశగా నేటి యువత మానవతా దృక్పథంతో ముందుకు సాగాలని జేసీఐ జాతీయ మాజీ అధ్యక్షుడు జేసీ సునీల్కుమార్ అన్నారు. జేసీఐ బంజారా హైదరాబాద్, బంజారా హైదరాబాద్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో జేసీ గోవింద్ కాకాని అధ్యక్షతన ఆదివారం కాచిగూడలోని టూరిస్ట్ హోటల్లో 40 మంది దివ్యాంగులకు కృత్రిమ కాళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా సునీల్కుమార్ హాజరై మాట్లాడుతూ.. దివ్యాంగులకు సరైన ప్రోత్సాహం లభిస్తే అన్ని రంగాల్లో రాణిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేసీఐ జోన్ అధ్యక్షుడు జేసీ శీలా మంజునాథ్, కో- ఆర్డినేటర్ సంతోష్కుమార్ నల్లా, జేసీ ప్రశాంత్ అగర్వాల్, జేసీ ఫణీంద్ర, జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ బంజారా హైదరాబాద్ అధ్యక్షుడు గోవింద్ కాకాని, ట్రస్టీ వినయ్ మెహత తదితరులు పాల్గొన్నారు.