సిటీబ్యూరో, మార్చి 16(నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోతున్నారా.. స్మార్ట్ఫోన్ వ్యసనం నుంచి బయటకు రాలేకపోతున్నా రా.. అలాంటి వారికోసం ‘దిల్సే వలంటీర్లు’ వస్తున్నా రు.. వారికి అవగాహన కల్పించి.. సైబర్ నేరాల బారిన పడకుండా చూడనున్నారు.. ఇందుకు స్కూళ్లు, కాలేజీల్లో ప్రతి శనివారం విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు. స్కూల్ స్థాయి నుంచే వారిని అప్రమత్తం చేసే దిశగా సైబరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు.
విద్యార్థులు, యువత సైబర్ నేరాల బారిన పడకుండా, సోషల్ మీడియా వ్యసం నుంచి వారిని కాపాడేందుకు దిల్సే వలంటీర్లు సిద్ధమవుతున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్సీఎస్సీ) సంయుక్తంగా ఎండ్ నౌ సంస్థతో కలిసి ప్రత్యేకంగా ఈ దిల్ సే వలంటీర్లను తీర్చి దిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో దిల్ సే వలంటీర్లుగా పని చేసేందుకు ముందుకు వచ్చిన 125 మందికి సైబర్ సెక్యూరిటీ నిపుణులతో శిక్షణ ఇచ్చి.. వారికి ఈ నెలలో మరోసారి అర్హత పరీక్షలు నిర్వహిం చనున్నారు. అందులో ఉత్తీర్ణులైన వారిని దిల్సే వలంటీర్లుగా ఎంపిక చేసి.. సర్టిఫికెట్లు అందజేయనున్నారు. ఆ తర్వాత వారిని స్కూళ్లు, కాలేజీలకు పంపించి సైబర్ నేరాల పట్ల అప్రమత్తం చేయనున్నారు. విద్యార్థులు, యువతను సైబర్ నేరాల బారిన పడకుండా, స్మార్ట్ ఫోన్ వ్యసనానికి గురికాకుండా ప్రతి శనివారం వారికి కేటాయించిన పాఠశాలలు, కాలేజీల్లో పాఠాలను బోధించనున్నారు. ఈ విధంగా విద్యార్థి దశ నుంచే సైబర్ నేరాల పట్ల అప్రమత్తం చేస్తే.. వారితో పాటు వారి ఇండ్లలో కూడా సైబర్ మోసాలపై అవగాహన పెరిగి సైబర్ క్రిమినల్స్కు చిక్కకుండా అలర్ట్గా ఉంటారని సైబరాబాద్ పోలీసులు ఆశిస్తున్నారు.
అమాయకులు సైబర్ నేరాలకు చిక్కుకుని ఆర్థికంగా నష్టపోకుండా.. వారిని కాపాడటంతో పాటు విద్యార్థులు స్మార్ట్ ఫోన్ వ్యసనానికి గురికాకుండా ఉండేందుకే ఈ దిల్సే వలంటీర్లను తీర్చి దిద్దుతున్నాం. దీని కోసం ఐటీ రంగాలతో పాటు ఆసక్తి గల విద్యావంతులను దిల్ సే వలంటీర్లుగా స్వచ్ఛందంగా పని చేసేందుకు ఆహ్వానిస్తున్నాం. మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తి చేశాం. వారికి తుది పరీక్ష నిర్వహించి.. వలంటీర్లుగా ఎంపిక చేస్తాం. ఈ వలంటీర్లకు కూడా సైబర్ సెక్యూరిటీ నిపుణులు, సైబర్ క్రైం పోలీసులతో శిక్షణ ఇప్పించాం. దిల్ సే వలంటీర్ల ప్రధాన ఉద్దేశ్యం సైబర్ నేరగాళ్ల నుంచి సామాన్యులను కాపాడటంతో పాటు యువత ఇంటర్నెట్కు బానిస కాకుండా.. వాటిని తమ అవసరాలకు ఎలా ఉపయోగించుకోవాలనే అంశాలపై అవగాహన కల్పిస్తాం. – కృష్ణ ఏదుల, ప్రధాన కార్యదర్శి ఎస్సీఎస్సీ