హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) లేడీస్ హాస్టల్(Ladies hostel) ముందు విద్యార్థినులు ధర్నా (Dharna)చేపట్టారు. మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చాయంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. చీఫ్ వార్డెన్ను తొలగించి సరైన సౌకర్యాలు కల్పించాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. గతంలోనే సమస్యలు పరిష్కరించాలని విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.