కవాడిగూడ, మార్చి 16: దేశ వ్యాప్తంగా బీసీల గణన చేపట్టాలని, చట్టసభలలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లను పెంచాలనే డిమాండ్లతో ఈ నెల 28న ఢిల్లీలో మహాధర్నా, 29న బీసీల జనగణన దీక్షను చేట్టాలని నిర్ణయించినట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
గురువారం దోమలగూడలోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ గణన చేపడుతామన్న బీజేపీ ప్రభుత్వం హామీని విస్మరించిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంపై సమరభేరీ మోగించడానికి ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద రెండు రోజుల పాటు ఆందోళనలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారపు గణేశాచారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్, రాష్ట్ర మహిళా సంఘం కార్యనిర్వాహక అధ్యక్షురాలు మణి మంజరి, గ్రేటర్ అధ్యక్షుడు మాదేశి రాజేందర్, యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి బండిగారి రాజు, స్వర్ణగౌడ్, గౌతమి, శ్రీదేవి, కళావతి, శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.