మేడ్చల్, మార్చి 14 : ధరణి పోర్టల్లో ఉన్న లోపాలను సవరించి, నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని ధరణి కమిటీ చైర్మన్ కోదండ రాంరెడ్డి అన్నారు. శామీర్పేట మండలంలోని బొమ్మరాశిపేట గ్రామంలో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 50 ఏండ్ల కిందట కొనుగోలు చేసిన భూమి సైతం ధరణిలో బ్లాక్ లిస్టులో పెట్టారన్నారు.
సుమారు 1050 ఎకరాలు భూమి చాలా కాలంగా సాగు చేస్తున్నా రిజిస్ట్రేషన్ చేయలేదన్నారు. ధరణి లోపాలను అధిగమించడానికి ధరణి పోర్టల్ నూతన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. నష్టపోయిన సన్నకారు రైతులకు మేలు చేసేందుకు లోపాలను, సాఫ్ట్వేర్ సమస్యలను సవరిస్తామని తెలిపారు. నూతన చట్టాలను రైతులకు న్యాయం చేసేలా అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గల్ సెల్ అడ్వయిజర్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.