IPS Transfers : రాష్ట్రంలో మరోసారి భారీగా ఐపీఎస్(IPS)ల బదిలీలు జరిగాయి. 36 మంది డీఎస్పీలకు స్థానం చలనం కల్పిస్తూ సోమవారం డీజీపీ సీవీ ఆనంద్(CV Anand) ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ జాయింట్ కమిషనర్గా కొనసాగుతున్న డి.జోయల్ డేవిస్ ఐదో జోన్, యాదాద్రి డీఐజీగా నియమితులయ్యారు. రామగుండం కమిషనర్ అంబర్ కిశోర్ ఝా జోన్ 1 డీఐజీగా బదిలీ అయ్యారు. వరంగల్ కమిషనర్గా పనిచేస్తున్న సన్ప్రీత్ సింగ్ సైబరాబాద్ ట్రాఫక్ జాయింట్ సీపీగా వెళ్లనున్నారు.
హైదరాబాద్ ఉత్తర జాయింట్ సీపీ శ్వేతా రెడ్డి వరంగల్ సీపీగా బదిలీ అయ్యారు. సీఐడీ ఎస్పీగా రూపేణ్, ఏసీబీ జాయింట్ డెరెక్టర్గా చంద్రమోహన్, సాయి మనోహర్, ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఇక్బాల్, హైడ్రా అదనపు కమిషనర్గా ఆనంద్ కుమార్ నియమితులయ్యారు. గోల్కొండ జోన్ డీసీపీగా రాఘవేంద్ర రెడ్డి బదిలీ అయ్యారు. సికింద్రాబాద్ రైల్వే ఎస్సీగా వై.సాయి శేఖర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అవినీతి నిరోధక శాఖలో జాయింట్ డైరెక్టర్గా ఉన్న సీహెచ్.సింధు శర్మ సీఐ సెల్, ఇంటెలిజెన్స్ ఎస్పీగా బదిలీ అయ్యారు.