హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): పలువురు సివిల్ డీఎస్పీలకు పోస్టింగ్లు, బదిలీ కల్పిస్తూ డీజీపీ అంజనీకుమార్ ఉత్తర్వులిచ్చారు. ఆరుగురికి స్థానచలనం కలుగగా ముగ్గురు వెయిటింగ్లో ఉన్నారు, మరో ముగ్గురు పలు స్థానాల్లో ఉన్నారు. పీ శ్రీనివాస్ నాయుడుకు నగర సీటీసీ ఏసీపీ (వెయింటింగ్ )గా పోస్టింగ్ ఇచ్చారు.
సైబరాబాద్ ఏసీపీ జీవీ రమణగౌడ్ను డిప్యుటేషన్ మీద టీఎస్ ట్రాన్స్కోకు పంపారు. వెయిటింగ్లో ఉన్న కే పార్థసారథికి కల్వకుర్తి ఎస్డీపీవోగా, ఎస్ శ్రీనివాసులుకు బాలానగర్ ట్రాఫిక్ ఏసీపీ (వెయింటింగ్)గా పోస్టింగ్ ఇచ్చారు. బాలానగర్ ట్రాఫిక్ ఏసీపీ బీ రమేశ్ను, కల్వకుర్తి ఎస్డీపీవో కే శంకరయ్యను చీఫ్ ఆఫీస్లో రిపోర్టు చేయాలని ఆదేశించారు.