గజ్జెల లాగులు.. ఢమరుక నాదాలు..
డోలు చప్పుళ్లు.. అర్చకుల పూజలు..
ఒగ్గు పూజారుల పట్నాలు.. పోతరాజుల విన్యాసాలు.. మహిళల బోనాల సమర్పణతో సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న క్షేత్రం పులకించిపోయింది. ఆదివారం పట్నం వారంతో క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. మల్లన్న నామస్మరణతో క్షేత్రం పరవశించింది.