కేపీహెచ్బీ కాలనీ, జనవరి 8 : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎనిమిదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి పనులు, పేదలకు అందుతున్న సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కరికీ వివరించాలని.. కేపీహెచ్బీ కాలనీ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా బలోపేతం చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపునిచ్చారు. ఆదివారం కేపీహెచ్బీ కాలనీ 9వ ఫేజ్లో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సహకారంతో కూకట్పల్లి నియోజకవర్గం, కేపీహెచ్బీ కాలనీ డివిజన్లో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. ఎనిమిదేండ్ల కాలంలో కేపీహెచ్బీ కాలనీలో జరిగిన అభివృద్ధి పనులు ఎక్కడా జరుగలేదని ఈ పనులు ప్రజలకు కండ్లముందే కనబడుతున్నాయన్నారు. చేసిన పనులను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. బూత్స్థాయి కమిటీలను వెంటనే పూర్తి చేయాలని, కష్టపడి పనిచేసే వారికే భవిష్యత్లో గుర్తింపు లభిస్తుందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావు, నియోజకవర్గం కో ఆర్డినేటర్ సతీశ్ అరోరా, డివిజన్ అధ్యక్షుడు ఎం.కృష్ణారెడ్డి, సీనియర్ నేతలు అడుసుమల్లి వెంకటేశ్వర్రావు, మందలపు సాయిబాబా చౌదరి, రాజేశ్, వెంకట్రెడ్డి, పాతూరి గోపి తదితరులున్నారు.
ఆరోగ్యమే మహాభాగ్యం
ఆరోగ్యమే మహాభాగ్యమని.. ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో నడక, వ్యాయామం, యోగా లాంటి వాటికి సమయాన్ని కేటాయించి ఆరోగ్యవంతంగా జీవించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం గోపాల్నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్యంపై అవగాహన కల్పించడం కోసం నిర్వహించిన 5కే రన్ పోటీలను ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహానగరంలో నివసిస్తున్న ప్రజలంతా ఆరోగ్యంగా జీవించాలన్న లక్ష్యంతో పార్కులు, క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని, మితాహారం, రోజూ నడకతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించాలన్నారు. అనంతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మాజీ అధ్యక్షుడు సాయిబాబా చౌదరి, వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు అజయ్, సునీల్, బైర ఫుడ్స్ అండ్ బేవరేజెస్ ఫౌండర్ సీఈవో బైర అజయ్బాబు ఉన్నారు.
రెడ్డి మధుసూదన్రావుకు నివాళి
కేపీహెచ్బీ కాలనీ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు రెడ్డి మధుసూదన్రావు దశ దినకర్మ కార్యక్రమంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొని మధుసూదన్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు రెడ్డి సతీశ్ అరోరాను పరామర్శించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావు, మాజీ కార్పొరేటర్ బాబురావు, డివిజన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, అడుసుమల్లి వెంకటేశ్వర్రావు, ప్రభాకర్గౌడ్, వెంకటేశ్ చౌదరి, పవన్, పాతూరి గోపి, పులి మురళీ, భవానీ, రాజేశ్, రావెల్షా తదితరులున్నారు.