అల్వాల్, డిసెంబర్ 6: గతంలో ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళవారం వెంకటాపురంలోని అయోధ్య ఎన్క్లేవ్లో రూ.35 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ సబితాఅనిల్ కిశోర్తో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా రవాణాకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రతి కాలనీలో సీసీ రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్ రెడ్డి, అనిల్ కిశోర్గౌడ్, డీఈఈ కార్తిక్, ఏఈ అరుణ్, వర్క్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు, నాయకులు భాస్కర్, ప్రభాకర్, శివ, రఘునాథ్, శ్యామ్సుందర్, నర్సింహ, సాయి, గణేశ్, జనార్దన్, తదితరులు పాల్గొన్నారు.