కందుకూరు : గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు మూల హన్మంత్రెడ్డి శుక్రవారం మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
బాచుపల్లికి రూ. 20లక్షలు, లేమూరు సీసీ రోడ్లకు అగర్మియగూడకు రూ.30లక్షలు, బైరాగిగూడకు రూ.20లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానన్నారు. రైతు సమసన్వమ సమితి అధ్యక్షుడు గోపీరెడ్డి సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.