గౌతంనగర్, జనవరి 5 : ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యపడుతుందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. గురువారం గౌతంనగర్ డివిజన్, మల్లికార్జుననగర్లో రూ.59లక్షలు, వినాయకనగర్ డివిజన్లోని అంబేద్కర్నగర్, శివసాయినగర్లలో రూ.90లక్షలు, ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ బ్యాంక్ కాలనీలో రూ.23లక్షలతో సీసీ రోడ్ల పనులను కార్పొరేటర్లు ప్రేమ్కుమార్, మేకల సునీతా రాముయాదవ్, రాజ్యలక్ష్మితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ పనిచేస్తుందన్నారు. అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పుష్కలంగా నిధులు మం జూరు చేస్తుందన్నారు. సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పాదయాత్రలు చేపట్టి.. సమస్యలను తెలుసుకొని.. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపా రు. డ్రైనేజీ పనులు పూర్తి చేసిన ప్రాంతాల్లో సీసీ రోడ్ల ప నులు చేపడుతున్నామని తెలిపారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో చాలా మేరకు అభివృద్ధి పనులను పూర్తి చేశామని.. మిగతా పనులను త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు.
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయని తెలిపారు. సమస్యలు ఎక్కడ ఉన్నా.. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమం లో డీఈ లౌక్య, ఏఈ సత్యలక్ష్మి, బీఆర్ఎస్ నాయకులు పిట్ల శ్రీనివాస్, జీఎన్వీ సతీశ్కుమార్, మేకల రాముయాదవ్, గుండా నిరంజన్, ఉపేందర్రెడ్డి, ఎస్ఆర్ ప్రసాద్, ఫరీద్, ప్రభాకర్రెడ్డి, బాలకృష్ణగుప్తా, సంతోష్రాందాస్, భాస్కర్, పిట్ల నాగరాజు, లత, చంద్రకాంత్, అరుంధతి, శివానగర్ కాలనీ అధ్యక్షుడు అంజయ్య, ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్, తిరుమల దేవి, అనసూ య, చారి, రాంచందర్, సత్యనారాయణ, శ్రీనివాస్గుప్తా, వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.