బండ్లగూడ : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు తగిన చర్యలు తీసుకోవాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. బీజేఎంసీ కార్యాయలంలో మేయర్ మహేందర్గౌడ్ అధ్యక్షతన బుధవారం 2022-2023 ఆర్ధిక సంవత్సరానికి అంచన బడ్జెట్, 2021-2022 ఆర్దిక సంవత్సరానికి సవరణ బడ్జెట్ ఆమోదం కోసం సమావేశంను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిక్జైన్, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సమస్యలు కూడ పెరుగుతాయి.కాబట్టి ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి కట్టుగా పని చేసి కార్పొరేషన్ అభివృద్దికి పటు పాడాలన్నారు.
ఈ కారక్రమంలో కమిషనర్ వేణుగోపాల్రెడ్డి,డిప్యూటి మేయర్ పూలపల్లి రాజేందర్రెడ్డి,కార్పొరేటర్లు,కోఅప్షన్ సభ్యులు పాల్గొన్నారు.