డప్పుల దరువుకు అనుగుణంగా విన్యాసాలు…శివసత్తుల పూనకాలు…బోనాలు సమర్పించేందుకు బారులు తీరిన మహిళలు…అమ్మవారికి మొక్కులు…తొట్టెల, ఫలహారం బండ్ల ఊరేగింపును తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఆదివారం బోనాల జాతర వైభవంగా జరిగాయి.
కంటోన్మెంట్ పరిధి బాలంరాయిలోని శ్రీదేవి దండు మారమ్మ దేవాలయం, ఈద్గా శీతల పోచమ్మతో పాటు రైల్వే అంబేద్కర్నగర్ కాలనీలో నల్ల పోచమ్మ ఆలయాలతో సహ సీతాఫల్మండి పోచమ్మ, ముత్యాలమ్మ, తార్నాకలోని ముత్యాలమ్మ ఆలయాల్లో బోనాల జాతర జరిగింది. రాష్ట్ర దేవాదాయ శాఖ తరఫున డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ శ్రీ దేవి దండుమారమ్మకు పట్టువస్ర్తాలతో పాటు టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముప్పిడి గోపాల్ ఏర్పాటు చేసిన బంగారు బోనంను సమర్పించారు.
నల్ల పోచమ్మ ఆలయంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి బోనాల సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యుడు ప్రభాకర్, బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, నేతలు మోతే శోభన్రెడ్డి, ముప్పిడి మధుకర్, శ్రీనివాస్, నరేష్, సాయికిరణ్, సాంబ అశోక్ పాల్గొన్నారు.
సీతాఫల్మండి మేడిబావిలోని పోచమ్మ, ముత్యాలమ్మ ఆలయంలో ఆదివారం జరిగిన బోనాల ఉత్సవాలలో సాయంత్రం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవార్ల దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ సింగిల్ ట్రస్టీ పరికిబండ కళా ప్రకాశ్ మంత్రికి శాలువాకప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం మెమెంటోను అందజేశారు. ఈ కార్యక్రమం లో గుర్రం పవన్కుమార్ గౌడ్, అశోక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బోనాల ఉత్సవాల్లో భాగంగా అడ్డగుట్ట, ఆజాద్ చంద్రశేఖర్ నగర్, వడ్డెర బస్తీ రేణుకాఎల్లమ్మ ఆలయం, లాలాగూడలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన వేడుకల్లో స్థానిక కార్పొరేటర్ లింగాని ప్రసన్న శ్రీనివాస్, తెరాస రాష్ట్ర యువ నాయకుడు రామేశ్వర్ గౌడ్, కిరణ్ గౌడ్, గ్రంథాలయం డైరెక్టర్ లింగాని శ్రీనివాస్తో కలిసి ఆమె ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీశ్రేణులు నక్కమధు, పెండెం మనోహర్, వసంత, గౌస్, ప్రవీణ్, మనోజ్, వడ్లూరి రవి, మల్లేష్, గోపీ, రాజుతో పాటు తదితరులు పాల్గొన్నారు.