రవీంద్రభారతి, ఏప్రిల్ 10 : సినివారంలో భాగంగా లతా భగవాన్ కరే సినిమా టీంతో ముఖాముఖి శనివారం రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భాషా సాంస్కృతి శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి విచ్చేసి చిత్ర బృందాన్ని సత్కరించారు. ఈ సందర్భం గా రామచంద్రమూర్తి మాట్లాడుతూ రవీంద్రభారతిలో ఇంతగొప్ప కార్యక్రమం జరుగుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. అప్పట్లో ఈ ప్రాంతంలో ఉన్న అమెరికన్ లైబ్రరీలో అనేక ప్రపంచ సినిమాలు చూశామని, మళ్లీ రవీంద్రభారతిలో సినిమా థియేటర్ను చూస్తున్నామన్నారు. సినివారం కార్యక్రమాన్ని రూపొందించినందుకు, రియల్పాత్రలతో ‘లత భవాన్ కరే’ సినిమా తీసిన వారు తమకెంతో గర్వంగా ఉందన్నారు. మామిడి హరికృష్ణ మాట్లాడుతూ ఏ లక్ష్యంతోనైతే సినిమాలు రూపొందించబడిందో ఆ లక్ష్యం ఈ రోజు నెరవేరిందన్నారు. జీవితాన్ని చూపించే, ప్రతిబింబించే సినిమా తీసి జాతీయ స్థాయిలో తెలంగాణ బిడ్డ ల క్రియేటివిటీ జెండాను ఎగురవేశారని అన్నారు. కార్యక్రమంలో ‘లతా భవవాన్ కరే’ సినిమా దర్శకుడు దేశబోయిన నవీన్, ఎడిటర్ బొడ్డు శివకుమార్, నిర్మా త కృష్ణ, మ్యూజిక్ దర్శకుడు సమీర్ పాల్గొన్నారు.