కొండాపూర్:శేరిలింగంపల్లి, చందానగర్ జంట సర్కిళ్లలో అక్రమ నిర్మాణాలను గురువారం టౌన్ప్లానింగ్ అధికారులు, విజులెన్స్, న్యాక్ అధికారులు, పోలీసుల సహకారంతో కూల్చివేశారు. జంట సర్కిళ్ల టౌన్ప్లానింగ్ ఏసీపీలు స్వప్న రెడ్డి, సంపత్ల ఆధ్వర్యంలో అనుమతులు లేని నిర్మాణాలను సిబ్బంది కూల్చివేశారు. రెండు సర్కిళ్ల పరిధిలోని అక్రమ నిర్మాణాల వివరాలను సేకరించినట్లు తెలిపారు. సేకరించిన వివరాల ప్రకారం ఏరియాల వారీగా కూల్చివేతలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కూల్చివేతల్లో భాగంగా కొండాపూర్, చందానగర్ డివిజన్ల పరిధిలోని పలు నిర్మాణాలను కూల్చివేసినట్లు తెలిపారు. కాగా ఇకపై అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని, ప్రభుత్వం అనుమతుల కోసం నూతనంగా తీసుకువచ్చిన టీఎస్ బీ పాస్ విధానంతో సులభతరమయిందన్నారు. ఆన్లైన్లోనే అనుమతికి దరఖాస్తు చేసుకోవడంతో పాటు అక్కడి నుంచే అనుమతి దృవీకరణ పత్రాన్ని పొందవచ్చన్నారు. కూల్చివేతల్లో టౌన్ప్లానింగ్ టీపీఎస్ లు, చైన్మెన్లు తదితరులు పాల్గొన్నారు.