మెహిదీపట్నం జనవరి 30 : విలాసవంతమైన జీవితం కోసం డెలివరీ బాయ్గా వెళ్లి చైన్స్నాచింగ్ చేసిన నిందితుడిని లంగర్హౌస్ పోలీసులు సోమవారం రిమాండ్కు తరలించారు. లంగర్హౌస్ ఏసీపీ ఆర్జీ శివమారుతి, ఇన్స్స్పెక్టర్ శ్రీనివాస్, అదనపు ఇన్స్పెక్టర్ ముజీబ్ ఉర్ రహమాన్తో కలిసి విలేకరులకు వివరాలు వెల్లడించారు.
కామారెడ్డికు చెందిన సయ్యద్ హమీద్(24) మెహిదీపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ డెలివరీబాయ్గా పనిచేస్తున్నాడు. జనవరి 23న లంగర్హౌస్ ఓంనగర్లో నివసించే వజహత్ ఉన్నీసా ఇంటికి డెలివరీ బాయ్గా వెళ్లాడు. ఆ సమయంలో ఒంటరిగా ఉండడంతో ఆమె మెడలోని 2 తులాల బంగారు గొలుసును తెంపుకుని పారిపోయాడు. పోలీసులు విచారణ చేపట్టి సోమవారం సయ్యద్ హమీద్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.