ఒంటిచేత్తో.. షాట్ కొడుతూ..!
ప్రత్యర్థులను..మట్టికరిపిస్తూ..!
పతకాల పంట.. నాయక్తోనే నంటా..!
(బొమ్మెర్ల శ్రీకాంత్)శామీర్పేట, నవంబర్ 10 : ఎవరైనా ఒక రంగంలో అద్భుత ప్రతిభ చూపిస్తారు. కానీ ఈ నేస్తం ఇటు క్రికెట్లోనూ.. అటు వాలీబాల్లోనూ జాతీయ స్థాయిలో తన సత్తా చాటుతున్నాడు. ఓ చేతి లేనప్పటికీ ఆల్రౌండర్గా దూసుకుపోతూ అందరూ అవాక్కయ్యేలా చేస్తున్నాడు. ప్రతి పోటీలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ.. జాతీయ స్థాయి జట్టుకు కెప్టెన్గా వ్యహరిస్తున్నాడు. క్రికెట్ వరల్డ్ కప్, ప్యారా వాలీబాల్ ఒలింపిక్స్లో పతకం తేవడమే లక్ష్యంగా.. ముందుకు సాగుతున్నాడు. మట్టిలో మాణిక్యంలా వెలుగొందిన ఈ ‘క్రీడా సేవక్’ ఎవరు.. ఆ వివరాలు
మీ కోసం..
మారుమూల ప్రాంతంలో, సామాజికంగా వెనుకబడిన వర్గం నుంచి వచ్చిన యువకుడు జాతీయ స్థాయికి ఎదిగాడు. పేదరికం, వెనుకబాటు అతడి అకుంఠిత దీక్ష, పట్టుదల ముందు నిలువలేదు. తనకున్న అంగవికలత్వాన్ని తలుచుకొని బాధపడకుండా ఆసక్తి ఉన్న క్రీడారంగంపై దృష్టి సారించాడు. కఠోర శ్రమతో ఉన్నత స్థాయికి ఎదిగాడు. వాలీబాల్, క్రికెట్ క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేస్తూ ఎన్నో అవార్డులు సాధించాడు. క్రేజ్ ఎక్కువగా ఉన్న క్రికెట్లో ఎదగాలంటే అషామాషీ కాదు. పరిస్థితులకు వెరవకుండా మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం లింగాపూర్ తండా యువకుడు దీరావత్ మహేశ్నాయక్ ముందుకు సాగాడు. ఏకంగా బీడీసీఏ(బోర్డు ఆఫ్ డిజెబుల్డ్ క్రికెట్ అసోసియేషన్) కెప్టెన్గా ఎంపికయ్యాడు.
మహేశ్నాయక్ది అతి పేద కుటుంబం. అతడి తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటూ పొట్టపోసుకునే వారు. మహేశ్ ఆరేళ్లవయస్సు ఉన్నప్పుడు ఇంటి సజ్జపై నుంచి కింద పడటంతో కుడి చేయి విరిగింది. గాంధీ వైద్యశాలకు తీసుకెళ్లగా వైద్యులు చేతిని తొలగించారు. అయితే అతడు మొదట్లో న్యూనతా భావానికి గురైనప్పటికీ పాఠశాల స్థాయిలో తన దృష్టిని వాలీబాల్, క్రికెట్ వైపు మళ్లించాడు. ఒంటి చేత్తో బ్యాటింగ్, బౌలింగ్, ఫిల్డింగ్ చేయడం నేర్చుకొని, ఆల్ రౌండర్గా రాణించాడు. సాధారణ విద్యార్థులతో కలిసి ఆడుతూ తన ప్రతిభతో అబ్బురపరిచేవాడు. అందరి అభినందనలు అతడిలో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. తన ప్రతిభతో జిల్లా దివ్యాంగుల టీంకు, ఆ తర్వాత రాష్ట్ర టీంకు వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. తాజాగా జాతీయ టీంకు ఎంపిక కావడమే కాదు, ఏకంగా కెప్టెన్గా అవకాశం చేజిక్కించుకున్నాడు.
వరల్డ్ కప్ తీసుకురావడమే లక్ష్యం
గిరిజన కుటుంబానికి చెందిన తాను జాతీయ జట్టుకు కెప్టెన్గా ఎంపిక కావడం సంతోషంగా ఉంది. పారా స్పోర్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు బాబు, కార్యదర్శి సంజీవయ్య తనను ఆటలో రాణించేందుకు ఎంతగానో ప్రోత్సహించారు. అంజన్ రెడ్డి ఆర్థికంగా ఆదుకున్నాడు. తల్లిదండ్రుల ఆశీస్సులతో పాటు వారి ప్రోత్సాహంతో ఈ స్థాయికి ఎదిగాను. వరల్డ్ కప్ టీంలో కూడా స్థానం లభించింది. దేశానికి కప్ తీసుకురావడమే తన ధ్యేయం. పారా వాలీబాల్లో ఒలింపిక్స్కు ఎంపికై, పతకం సాధించాలని కోరుకుంటున్నాను. -దీరావత్ మహేశ్ నాయక్, బీడీసీఏ కెప్టెన్, లింగాపూర్ తండా
బంగ్లాదేశ్తో టెస్ట్ మ్యాచ్
నగరంలోని ఎల్బీ స్టేడియంలో బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్మ్యాచ్, టీ-20 మ్యాచ్లకు దీరావత్ మహేశ్నాయక్ ఇండియా టీం కెప్టెన్గా వ్యవహరించారు. క్రికెట్ ఒక్కటే కాదు అతడు వాలీబాల్లో కూడా ప్రతిభ చూపుతున్నారు. పారా వాలీబాల్ ఏషియన్ గేమ్స్కు దేశ జట్టులో స్థానం సంపాదించాడు.
ఆటలు.. అవార్డులు
_ 2018లో ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో మంత్రి జగదీశ్వర్రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ క్రీడాకారుడిగా అవార్డు.
_ 2018లో కర్ణాటకలోని మంగుళూరులో మారుతి స్వర్ణ ఇంటర్నేషనల్ అవార్డు.
_ 2019లో మహేశ్ తల్లి బుజ్జీకి మహిళా దినోత్సవం సందర్భంగా సన్మానం.
_ 2019లో ఇండియన్ బీచ్ వాలీబాల్ ప్రపంచ సిరీస్కు ఎంపికై చైనాలో వాలీబాల్ పోటీల్లో పాల్గొన్నాడు.
_ 2021లో ఐఆర్ ఇరాన్లో జరిగిన పీవీఏఓ జోన్ చాంపియన్షిప్ పోటీలకు ఎంపిక
_ 2021 ఆగస్టులో హైదరాబాద్లో బంగ్లాదేశ్ దివ్యాంగ జట్టుతో ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ల్లో చోటు.
_ 2021 పారా ఆసియా ఓసియానియా సిట్టింగ్ వాలీబాల్ చాంపియన్షిప్ పోటీలకు ఎంపిక.
_ ఈ నెల 2వ తేదీ నుంచి ఇండియా-బంగ్లాదేశ్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్కు టీమ్ కెప్టెన్గా ఎంపిక.
_ ఈ నెల 6న అమెరికా హెచ్ఈ ప్రొఫెసర్ డాక్టర్ మధుకృష్ణనన్ చేతుల మీదుగా ఇంటర్నేషనల్ సోషల్ ఎంటర్ ప్రిన్యూర్ అవార్డు.