శంషాబాద్ రూరల్ : కారు ఢీ కొనడంతో జింకమృతి చెందిన సంఘటన శుక్రవారం మండలంలోని నర్కూడ గ్రామ సమీపంలో జరిగింది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షాబాద్వైపు నుంచి శంషాబాద్ వైపు అతివేగంగా వచ్చిన కారు రోడ్డు దాటుతున్న జింకను ఢీ కోవడంతో అక్కడిక్కడే మృతి చెందిన్నట్లు తెలిపారు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఫారెస్టు అధికారులకు సమాచారం చేరవేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.