సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో రాత్రి ఉష్ణోగ్రతల్లో తగ్గుదల చోటుచేసుకోవడంతో ఉదయం, రాత్రి వేళల్లో వాతావరణం కొంత చల్లగా ఉంది.
ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 34.8డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 17.8డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 21శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.