దళిత బంధుతో పథకానికి దేశవ్యాప్తంగా డిమాండ్ వస్తది
దేశానికే ఆదర్శంగా దళితబంధు
త్వరలోనే నియోజకవర్గానికి 1500 మందికి..
దళితబంధు హైదరాబాద్ జిల్లా లబ్ధిదారుల అవగాహన సదస్సులో
మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
కేసీఆర్ మరో అంబేద్కర్.. మంత్రి మహమూద్ అలీ
సిటీబ్యూరో/సికింద్రాబాద్, మార్చి 26 : రాష్ట్రంలోని దళితులంతా ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. హైదరాబాద్ జిల్లాలోని 13 నియోజకవర్గాలలో ఎంపికైన దళితబంధు లబ్ధిదారులకు సికింద్రాబాద్లోని హరహర కళాభవన్లో అవగాహన సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత బంధు పథకాన్ని ప్రస్తుతం నియోజకవర్గానికి 100 మందినే ఎంపిక చేశారని, త్వరలోనే నియోజక వర్గంలో 1500 మందికి ఇస్తామని ప్రకటించారు. హోంశాఖ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మరో అంబేద్కరని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠాగోపాల్, రాజాసింగ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎల్ శర్మన్, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
30న దళితబంధు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు
మేడ్చల్, మార్చి 26 : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా దళితబంధు పథకానికి ఎంపికైన 561 మంది లబ్ధిదారులకు ఈ నెల 30న మంజూరు పత్రాలను అందజేయనున్నారు. ఇప్పటికే లబ్ధిదారుల నుంచి యూనిట్ల వారీగా డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లను సేకరించిన అధికారులు వారికి అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తున్నారు. మంజూరు పత్రాలు అందించిన వెంటనే ఎంపిక చేసుకున్న యూనిట్లను అందించే విధంగా అధికారులు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. యూనిట్లు ఏర్పాటు చేసుకున్నాక వ్యాపారం వృద్ధిలోకి వచ్చే వరకు ప్రత్యేక అధికారులు 6 నెలల వరకు పర్యవేక్షించనున్నారు. వ్యాపారానికి అవసరమైన లైసెన్స్లు అందించి జీఎస్టీపై అవగాహన కలిగించనున్నారు. ఈ నెల 30న తప్పనిసరిగా మంజూరు పత్రాలు అందస్తామని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్ తెలిపారు.
మా జీవితాల్లో వెలుగులు
స్వాతంత్య్రం వచ్చిన్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. మొదటిసారి సీఎం కేసీఆర్ మమ్మల్ని గుర్తించారు. మాకు అందనున్న రూ.10లక్షలతో పెయింటింగ్ మిషన్, టెంట్హౌస్ సామగ్రి కొనుగోలు చేసుకుంటాం. సీఎం కేసీఆర్ మా జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. – దుంప జీవేందర్, లబ్ధిదారుడు, టోలీచౌకి, హకీంపేట్
సీఎం కేసీఆర్ది గొప్ప సంకల్పం
సీఎం కేసీఆర్ది గొప్ప మనసు. ఆయన సంకల్పం గొప్పది. దళితులకు అన్నీ తానై నిలవడం సంతోషంగా ఉంది. దళితబంధు ద్వారా రూ.10లక్షలు ఇస్తూ బాగుపడాలని సూచిస్తున్నారు. దళితవాడలు, దళిత ప్రాంతాలు ఎవరికీ తక్కువ కాదని నిరూపిస్తాం. టీఆర్ఎస్కు, సర్కారుకు ఎప్పటికీ మద్దతుగా నిలస్తాం. మినీ సూపర్ మార్కెట్ పెట్టుకుని ఉపాధిని పొందుతాం.
– బుట్ట సునీత, లబ్ధిదారురాలు, ఫలక్నుమా