హరిదాస్పురాలో పథకం ద్వారా మంజూరైన టెంట్హౌస్ ప్రారంభం
మెహిదీపట్నం, జూలై 3 : ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని అర్హులందరికీ అందజేస్తున్నామని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్ అన్నారు. ఆదివారం లంగర్హౌస్ డివిజన్ హరిదాస్ పురాలో మహేందర్సింగ్కు దళితబంధు పథకం కింద మంజూరైన టెంట్హౌస్ను ఎమ్మెల్యే, కార్వాన్ కార్పొరేటర్ స్వామియాదవ్, ఎంఐఎం కార్పొరేటర్ ప్రతినిధి వజీఉజ్జమాసిద్ధికీ, నాయకులు సునంద, మాతంగి రమేశ్, గోపాల్, విజయ్, సోహైల్తో కలిసి ప్రారంభించారు.
లంగర్హౌస్ డివిజన్ హరిదాస్పురాకు చెందిన మహేందర్ సింగ్.. దళితబంధు పథకంలో భాగంగా టెంట్హౌస్కు దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం అతడికి టెంట్హౌస్ను మంజూరు చేసింది.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం..
ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం. దళితబంధు పథకంలో టెంట్హౌస్ను ప్రభుత్వం కేటాయించడంతో మా జీవితంలో కొత్తదనం వచ్చింది. ఆర్థికంగా బలపడటానికి మాకు టెం ట్హౌస్ వ్యాపారం ఉపయోగకరంగా ఉంటుంది. దళితబంధు పథకం దళితులకు మేలు చేకూరుస్తున్నది. పథకం ద్వారా దళితులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. మా కుటుంబం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు , తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటుంది.
– మహేందర్సింగ్, లబ్ధిదారుడు