ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ..
లబ్ధిదారులకు దళిత బంధు మంజూరు పత్రాలు అందజేత
దుండిగల్, ఏప్రిల్ 25: సమాజంలో దళితులు గౌరవప్రదమైన జీవితం గడపాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్రామ్ కన్న కలలు నేడు నిజమవుతున్నాయని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు శంభీపూర్రాజు ఆన్నారు. సోమవారం శంభీపూర్లోని ఎమ్మెల్సీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, మహేశ్వరం గ్రామానికి చెందిన 43 మంది దళితులకు రాష్ట్రప్రభుత్వం అందజేసిన దళితబంధు పథకం మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన స మావేశంలో వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దళితుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారని, ఈ నేపథ్యంలోనే దళితులు ఆర్థికంగా నిలదొక్కుకుని సమాజంలో గౌరవంగా తలెత్తుకుని బతికేందుకు దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు.
ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్థిక సహాయం అందజేస్తుందని, తద్వారా సొంతంగా వ్యాపారాలు నిర్వహించుకుని ఆర్థికంగా పురోభివృద్ధి సాధించాలని కోరారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అర్హులైన దళితులందరికీ ఈ దళిత బంధు పథకాన్ని వర్తింపజేస్తామని పేర్కొన్నారు. కార్యక్ర మంలో ఆర్డీవో మల్లయ్య, ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారి బాలా జీ, మేడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగరాజుయాదవ్, దుండిగల్ మున్సిపల్ చైర్పర్సన్ సుంకరి క్రిష్ణవేణికృష్ణ, వైస్ చైర్మన్ తుడుం పద్మారావు, పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్రెడ్డి, కౌన్సిలర్లు శంభీపూర్కృష్ణ, నర్సారెడ్డి శ్రీనివాస్రెడ్డి, అర్కల అనంతస్వామితో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.