హయత్నగర్, డిసెంబర్ 24 : దళితులు ఆర్థికంగా బలోపేతం చెందాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. శనివారం దళిత బంధు పథకంలో భాగంగా హయత్నగర్ డివిజన్లోని ఓల్డ్ హయత్నగర్కు చెందిన పారంద ప్రభుకు మంజూరైన ఎర్టిగా కారును బీఆర్ఎస్ హయత్నగర్ డివిజన్ అధ్యక్షుడు చెన్నగోని శ్రీధర్గౌడ్తో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత బంధు పథకం విజయం సాధించడం లబ్ధిదారుల చేతుల్లోనే ఉందని, సీఎం కేసీఆర్ మనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులు ఆర్థికాభివృద్ధి చెందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ హయత్నగర్ డివిజన్ యువనాయకులు డ్యాగల రాకేశ్, ఇంద్రకరణ్రెడ్డి, జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు వినతి
హయత్నగర్ డివిజన్లోని శ్రీపద్మావతి కాలనీలో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డిని బీఆర్ఎస్ హయత్నగర్ డివిజన్ అధ్యక్షుడు చెన్నగోని శ్రీధర్గౌడ్ ఆధ్వర్యంలో ఆయా కాలనీవాసులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీపద్మావతి కాలనీలో హనుమాన్ టెంపుల్ వద్ద సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణంపై ఎమ్మెల్యేను కలిశామని తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే సుధీర్రెడ్డి సానుకూలంగా స్పందించి త్వరలోనే కాలనీలో సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతానని హామీనిచ్చారని తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో కాలనీవాసులు అంతటి అమర్నాథ్గౌడ్, యాదగిరిరెడ్డి, బత్తుల మహేశ్గౌడ్, సుర్వి అజయ్గౌడ్, తదితరులు ఉన్నారు.
జనాభాకు అనుగుణంగా..
మన్సూరాబాద్, డిసెంబర్ 24: రోజు రోజుకూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మంచినీటి వ్యవస్థను ఏర్పాటు చేసి భవిష్యత్తులో కాలనీల్లో తాగునీటి సమస్యలు లేకుండా చూస్తానని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. నాగోల్ డివిజన్ పరిధి జైపురికాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్యామల యాదగిరి ఆధ్వర్యంలో శనివారం కాలనీలో నెలకొన్న సమస్యలపై ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం, పార్కును అభివృద్ధి చేసి వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేయాలని, మంచినీటి సమస్య ఎమ్మెల్యేకు కాలనీవాసులు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జైపురికాలనీలో త్వరలో నూతన మంచినీటి పైపులైన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాలనీల్లో దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతూ ప్రజలకు పూర్తిస్తాయిలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ ఉపాధ్యక్షులు శ్రీనివాస్, శంకర్, ప్రధాన కర్యాదర్శి రాహుల్ పోతాని, కార్యదర్శులు కస్తూరి అశోక్, నరసింహ, కోశాధికారి బండ వేణుగోపాలకృష్ణ, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.