ముషీరాబాద్ : నిరుపేదలను అభివృద్ది పథంలోకి తీసుకురావడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. దశలవారిగా అర్హులైన వారికి దళిత బంధు పథకం వర్తింప చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ఆదివారం రాంనగర్ డివిజన్ ఎస్ఆర్టీ కమ్యూనిటీహాల్లో దళిత సంఘాల ఆధ్వర్యంలో దళిత బంధు పథకం అమలు తీరుపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి చిత్తశుద్దితో పని చేస్తుంద న్నారు. దళితులను గత పాలకులు ఓటు బ్యాంక్గానే వాడుకున్నారని, కేసీఆర్ వచ్చిన తరువాత దళితుల అభివృద్దికోసం పలు పథకాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి అమలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్, దళిత సంఘాల నేతలు గజ్జెల సూర్యనారాయణ, కె.స్వామి, గండి క్రిష్ణ, జీవై.గిరి, బల్వంత్, మోజస్, సిరిగిరి శ్యామ్, శ్యామ్సుందర్, ఎ.శ్రీనివాస్, ఎరం శేఖర్, గజ్జెల సంపూర్ణ, లలిత, నీలమ్మ, రాజు, సదానంద్, ప్రేమ్కుమార్, రామస్వామి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం దళిత బంధు పథకం అమలు చేస్తున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు.