శంషాబాద్ రూరల్, ఆగస్టు 4 : దళిత బంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. శంషాబాద్ మండలంలోని పలువురు లబ్ధిదారులకు మంజూరైన కార్లను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను ముందుకు తీసుకురావడం కోసం ప్రత్యేకంగా సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. మొదటి విడుతలో నియోజకవర్గానికి వంద చొప్పున లబ్ధిదారులకు పంపిణీ చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మ, జడ్పీటీసీ తన్వి, వైస్ ఎంపీపీ నీలంనాయక్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దండుఇస్తారి, పార్టీ మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి మోహన్రావు, నీరటి రాజుముదిరాజ్, దిద్యాల శ్రీనివాస్,మాజీ ఎంపీటీసీ మోహన్నాయక్, సర్పంచ్లు దేవికజగన్గౌడ్, బుచ్చమ్మ, ఎంపీటీసీ సరిత రవీందర్ పాల్గొన్నారు.
బాక్స్డ్రైన్ పనులు పూర్తి చేయాలి..
మైలార్దేవ్పల్లి, ఆగస్టు4: ఎంత వర్షం వచ్చిన వరద నీరు సాఫీగా వెళ్లేందుకు బాక్స్ డ్రైన్ నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. గురువారం మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని అప్పాచెరువు నుంచి రూ. 8.5 కోట్లతో నిర్మిస్తున్న బాక్స్ డ్రైన్ పనులను రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ జగన్తో కలిసి పరిశీలించారు. రెండు సంవత్సరాల క్రితం నుంచి అప్పాచెరువు నిండి వరద నీరు బెంగుళూరు హైవే రోడ్డుపైకి వచ్చి వాహనదారులను ఎంతగానో ఇబ్బందులకు గురిచేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మాట్లాడుతూ..అప్పాచెరువులో బాక్స్ డ్రైన్ నిర్మాణం చేపట్టడానికి ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేయించానని తెలిపారు. ఏడాది కాలం నుంచి 15 అడుగుల వెడల్పుతో ఏడు వందల మీటర్ల పొడువునా బాక్స్ డ్రైన్ పనులు శరవేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. బాక్స్ డ్రైన్ నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చూడాలని అధికారును ఆదేశించారు. బాక్స్డ్రైన్ పనులు చివరి దశకు వచ్చాయని తొందరలోనే పూర్తి చేస్తామని అధికారులు ఎమ్మెల్యే కు వివరించారు. సర్కిల్ ఈఈ నారేందర్గౌడ్, డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్గౌడ్ , వెంకటేశ్, శ్రీనివాస్రెడ్డి, నాని, మహేశ్రాజ్ తదితరులు పాల్గొన్నారు.