బాలానగర్ (హైదరాబాద్) : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన దళిత, బీసీ బంధు పథకాలను అమలు చేసి పేదలను ఆదుకోవాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Krishna Rao) ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రతిఘటిస్తామని ఆయన అన్నారు. గురువారం బాలానగర్ డివిజన్ వినాయక్నగర్లోని కార్పొరేటర్ ఆవుల రవీందర్రెడ్డి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు తనపై అచంచల విశ్వాసంతో ఎన్నికల్లో్ ప్రచారం చేసి గెలుపునకు ఎంతో కృషి చేశారని అన్నారు. నియోజకవర్గంలో మొత్తం 418 బూతులుండగా అన్నింటిలో మెజార్టీ (Majority) తో గెలిపించి హాట్రిక్ సాధించడానికి దోహదపడ్డారని కొనియాడారు. శాసనసభ ఎన్నికలలో తన గెలుపు కోసం కృషి చేసిన పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు.
ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా వాటిని పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్(BRS)ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి జరిగింది ప్రజలందరికీ తెలుసని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దర్శనం శాకయ్య, ఎండీ ఖాజా, సీనియర్ నాయకులు మందడి సుధాకర్రెడ్డి, దారం వెంకటేశం గుప్తా , పంజా రాంచందర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.