సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ): ట్రై కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ) పరిధిలో భారీ ఎత్తున పలువురు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల (ఈఈ)ల బదిలీలు జరిగాయి. డి. ఆశలత జీహెచ్ ఎంసీ ఈఈ నుంచి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈఈగా బదిలీ అయ్యారు. కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి మహమ్మద్ వహాజుద్దీన్ జీహెచ్ఎంసీకి బదిలీ అయ్యారు. కె. వరలక్ష్మి జీహెచ్ఎంసీ నుంచి ‘టఫిడో’ కు బదిలీ అయ్యారు. ఎస్. శ్రీనివాస్, ఆర్. ఇందిరా బాయ్, ఆర్. శ్రీనివాస్ రెడ్డి, సంపద ఈ నలుగురు జీహెచ్ఎంసీ ఈఈలను మలాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్కు బదిలీ చేశారు.
మలాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఆర్. లక్ష్మణ్ జీహెచ్ఎంసీకి బదిలీ అయ్యారు. సి. శ్రీకాంతి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి జీహెచ్ఎంసీకి బదిలీ అయ్యారు. ఎం. ప్రవీణ్ కుమార్ బి. రాములు నల్గొండ మున్సిపాలిటీ నుంచి జీహెచ్ఎంసీకి బదిలీ అయ్యారు.ఆర్. యాదగిరి జీహెచ్ఎంసీ నుంచి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు బదిలీ అయ్యారు. ఆర్. శివానంద్ పోస్టింగ్ కోసం నిరీక్షిస్తున్న ఈయనను జీహెచ్ఎంసీకి కేటాయించారు. బి.వి.ఎస్. పేర్రాజు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈఈ కార్యాలయం నుంచి జీహెచ్ఎంసీకి బదిలీ అయ్యారు.