సిటీబ్యూరో, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ ) : లదాఖ్ నుంచి హైదరాబాద్ వరకు 2500 కిలో మీటర్లు సైక్లింగ్ యాత్ర చేసి గురువారం ఉదయం 6 గంటలకు కొంపల్లిలోని డెకథ్లాన్కు చేరుకున్న 13 మంది రైడర్స్కు అభిమానులు స్వాగతం పలికారు. ఈ యాత్ర మరో 1300 కిలో మీటర్లు పూర్తి చేసుకుని కన్యాకుమారి చేరుకోనున్నదని హెచ్సీజీ ఫౌండర్ నందనూరి రవీందర్ తెలిపారు. దేశ వ్యాప్తంగా సైక్లింగ్ యాత్రకు విశేష ఆదరణ లభిస్తుందని చెప్పారు.