సిటీబ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ): అమేజాన్ డెలివరీ హబ్ పాయింట్ బిజినెస్ అవకాశం ఇస్తామంటూ నమ్మిస్తూ ఉప్పల్కు చెందిన ఓ బిల్డర్కు సైబర్ నేరగాళ్లు రూ.3 లక్షలు టోకరా వేశారు. బాధితుడికి అమేజాన్ హబ్ పాయింట్కు అవకాశముందంటూ ఒక ఈమెయిల్ వచ్చింది. దీంతో అందులో ఉన్న ఫోన్ నెంబర్కు బాధితుడు కాంటాక్టు చేయడంతో తమ పేర్లు రామ్, శ్రీకాంత్ అని తాము అమేజాన్తో మీకు వ్యాపార అవకాశాన్ని కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు. దీనికి మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, ఫార్మాలిటీస్ పూర్తి చేయాలంటూ ఒక ఫామ్ పంపించారు.
అందులో వివరాలతో పాటు రూ.3 లక్షలు పంపించాలని ఉండడంతో డబ్బులు కూడా పంపించాడు. ఆ తరువాత మరో రూ. 50 వేలు చెల్లించి, ఎంఓయు చేసుకోవాలని సూచించారు. ఈ మొత్తం మీకు తిరిగి వచ్చేస్తాయంటూ నమ్మించారు. అయితే వారి మాటలతో అనుమానం వచ్చిన బాధితుడు అమేజాన్లో తెలిసిన వారి వద్ద వాకబు చేయగా అదంతా మోసమని, అలా ంటి వారిని నమ్మొద్దంటూ సూచించారు. దీంతో బాధితుడు మల్కాజిగిరి సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు.