సిటీబ్యూరో, జనవరి 14 (నమస్తే తెలంగాణ): నకిలీ ఆధార్కార్డు(Fake Aadhaar), ఫాన్ కార్డులతో బ్యాంకు ఖాతాలు తెరిచి వాటిని సైబర్ ఛీటర్స్ ముఠాలకు అందిస్తున్న ఇద్దరు సైబర్నేరగాళ్లను(Cybercriminals) సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ కథనం ప్రకారం.. హర్యాన రాష్ట్రంలోని ఫరీదాబాద్కు చెందిన హిమాన్షు, ప్రవీణ్ ఢిల్లీకి చెందిన సైబర్ నేరగాడు దేవేందర్ పంచాల్తో చేతులు కలిపారు. దేశ వ్యాప్తంగా అమాయకులను మోసం చేయడం ఒక ఎత్తైతే, మోసం చేసి డబ్బులను బ్యాంకులలో డిపాజిట్ చేయడం మరో ఎత్తు.
ఇందులో భాగంగా బినామీ పేర్లతో బ్యాంకు ఖాతాలు సైబర్నేరగాళ్లకు అవసరముంటాయి. ఈ బ్యాంకు ఖాతాలు తెరిచే పనిని హిమాన్షు, ప్రవీణ్ తీసుకున్నారు. ఫేక్ ఆధార్కార్డు, ఫేక్ పాన్ కార్డులు తయారీ చేసి వివిధ బ్యాంకులలో ఖాతాలు తెరిచి దేవేందర్ పంఛాల్కు అందిస్తుంటారు. ఇదిలాఉండగా అమీర్పేట్కు చెందిన బాధితురాలికి ఫోన్ చేసి పార్ట్టైమ్ జాబ్ ఇస్తామంటూ సైబర్నేరగాళ్లు నమ్మించారు.
పార్ట్టైమ్ జాబ్ పేరుతో నమ్మించి ఆ తరువాత పెట్టుబడులు పెట్టిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగా బాధితురాలికి ఫోన్ చేసి రూ. 4.75 లక్షలు మోసం చేశారు, సైబర్నేరగాళ్ల మోసంపై సీసీఎస్ సైబర్క్రైమ్లో బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని ఇన్స్పెక్టర్ ప్రసాద్రావు నేతృత్వంలోని బృందం దర్యాప్తు జరిపింది.
దర్యాప్లులో ఢిల్లీ నుంచి మోసం జరిగినట్లు గుర్తించారు. బ్యాంకు ఖాతాలను పరిశీలించడంతో అవి నకిలీ ఆధార్, నకిలీ పాన్కార్డులతో హిమాన్షు, ప్రవీణ్లు తెరిచినట్లు గుర్తించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. సైబర్ మోసానికి పాల్పడిన దేవేందర్ పంచాల్ పరారీలో ఉన్నాడు.