సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): నగర శివారు కొత్తూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని వింటేజ్ క్లాసిక్ వెంచర్ ఫామ్ హౌస్పై సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అధికారులు దాడి చేసి బాధితురాలిని రెస్క్యూ చేసి, ఐదుగురు కస్టమర్లను అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మహేశ్వరం మండలం పెద్దమ్మ తాండ సర్పంచ్కు చెందిన ఫామ్ హౌస్ కొత్తూరు పోలీస్స్టేషన్ పరిధిలోని పెద్దమ్మతాండ రోడ్డులో ఉన్నది.
అక్కడ అనైతిక కార్యకలాపాలు, వ్యభిచారం జరుగుతుందనే సమాచారంతో సైబరాబాద్ పోలీసులు దాడి చేశారు. బాధితురాలిని రెస్క్యూ చేశారు. మహేశ్వరం మండలం సుబాన్పూర్కు చెందిన బొల్లు శ్రీకాంత్, పెద్దమ్మ తాండకు చెందిన పతాల్వత్ రాజు, చిన్న తుప్రకు చెందిన సంకటి నాగరాజు, నల్లచెరువు తాండకు చెందిన దనుల రవి, మంసానిపల్లికి చెందిన పెండ్లిమడుగు నవీన్లను అరెస్ట్ చేశారు. నిర్వాహకులు కిరణ్, రాహుల్, మెహిమ్ అలీ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.