– సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర డా.బి.ఆర్.అంబేద్కర్, డా. రాజేంద్రప్రసాద్ పాత్ర కీలకం
సిటీబ్యూరో, జనవరి 26 (నమస్తే తెలంగాణ): భారత రాజ్యాంగాన్ని రచించడంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, డాక్టర్ రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కొనియాడారు. 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని గురువారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఇతర పోలీసు అధికారులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ సీపీ అవినాశ్ మహంతి, ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ నాయక్, ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాస రావు, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్రెడ్డి, ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ విభాగం డీసీపీ ధార కవిత, డీసీపీలు ఇందిర, లావణ్య, సైబర్ క్రైం డీసీపీ రితిరాజ్ తదితరులు పాల్గొన్నారు.