Bala latha | ఖైరతాబాద్, ఏప్రిల్ 18: తెలుగు రాష్ర్టాల్లో పోటీ పరీక్షల కీలక సమయంలో సైబర్ నేరగాళ్లు తన ఇన్స్టిట్యూట్ వెబ్సైట్, ఈ మెయిల్, BALA LATHA MADAM అనే యూట్యూబ్ చానెల్ను హ్యాక్ చేశారని సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకురాలు బాలలత చెప్పారు. విద్యావేత్తలు, విద్యారంగంలో ఉన్న వారు సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సుమారు ఐదు లక్షలకుపైగా విద్యార్థులు తమ చానెల్ను అనుసరిస్తున్నారని చెప్పారు. వెబ్సైట్, యూట్యూబ్ చానెళ్లలో ఇష్టం వచ్చిన వీడియోలు అప్లోడ్ చేస్తున్నారని తెలిపారు.
దీంతో నిత్యం వేలాది మంది విద్యార్థులు ఫోన్లో తనను సంప్రదిస్తున్నారని పేర్కొన్నారు. సైబర్ హ్యాకర్స్ వెబ్సైట్లలోని విలువైన సమాచారాన్ని కరప్ట్ చేశారని, ఆదివారం ముషీరాబాద్ పోలీస్స్టేషన్, సోమవారం సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. లక్షలాది మంది పేద విద్యార్థుల భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, మహమూద్ అలీ ప్రత్యేక చొరవ తీసుకొని తన యూట్యూబ్ చానల్లోని మెటీరియల్, డాటాను రిట్రీవ్ చేసేలా కృషి చేయాలని కోరారు. ప్రస్తుతం విద్యార్థులు కొత్త యూట్యూబ్ చానెల్ BALA LATHA OFFICIALను సంప్రదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో ఆన్లైన్ శిక్షణ
కాచిగూడ, ఏప్రిల్ 18: రాష్ట్రంలోని నిరుద్యోగ యువత సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ కోర్సుల్లో శిక్షణకు ఈ నెల 27లోపు www.nacsindia. org ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ సంస్థ డైరెక్టర్ విమలారెడ్డి తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీర్, పాలిటెక్నిక్, డిప్లొమా చదివిన అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ కాచిగూడలో ఆమె మాట్లాడుతూ, సైబర్ సెక్యూరిటీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు దేశ, విదేశాలలో విస్తృతమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఐటీ, ఇన్ఫర్మేషన్ రంగాలు, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్, ఐటీ సెక్యూరిటీ ఇంజినీర్ తదితర విభాగాల్లో ఉద్యోగాలు పుష్కలంగా ఉంటాయని వివరించారు. వివరాలకు 7893141797 సంప్రదించాలని ఆమె కోరారు.