సిటీబ్యూరో, జులై 6 (నమస్తే తెలంగాణ): అథేర్ ఎలక్ట్రిక్ బైక్స్ డీలర్షిప్ పేరుతో నగరవాసికి సైబర్చీటర్స్ రూ. 12.5 లక్షలు టోకరా వేశారు.
బెంగళూర్కు చెందిన అథేర్ ఎనర్జీ సంస్థ డీలర్షిప్ కోసం ఇంటర్నెట్లో వెబ్సైట్ను పరిశీలించిన సీతాఫల్మండికి చెందిన బాధితుడు.. ఒక నకిలీ వెబ్సైట్లోకి వెళ్లి.. సైబర్చీటర్స్కు చిక్కాడు. రూ. 12.5 లక్షలను పోగొట్టుకున్నాడు. సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.