హిమాయత్నగర్, జూలై 6 : ఆమెజాన్ కంపెనీలో ఉద్యోగం కల్పిస్తామని చెప్పి పెట్టుబడి పెట్టించి రూ.63 వేలు కాజేసిన సంఘటన నారాయణగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ బి.గట్టుమల్లు తెలిపిన వివరాల ప్రకారం.. కింగ్కోఠికి చెందిన ఓ వ్యక్తి ఫోన్కు ఆమెజాన్లో పార్ట్ టైమ్ ఉద్యోగాలు ఉన్నాయని మెసేజ్ వచ్చింది.
అందులోని నంబర్ను సంప్రదించగా పలు సంస్థలకు చెందిన వస్తువులను విక్రయించాల్సి ఉంటుందని దానికి ముందుగా కొంత నగదు చెల్లించాలని సైబర్ నేరగాళ్లు చెప్పారు. వారి మాటలు నమ్మించిన బాధితుడు విడతల వారీగా రూ.63వేలు సైబర్ నేరగాళ్లు చెప్పిన ఖాతాల్లో జమచేశాడు. అయినప్పటికీ ఇంకా డబ్బులు పంపించాలని తెలుపడంతో అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.