సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగాణ): సైబర్ చీటర్లు మళ్లీ పంజా విసిరారు. ఓ గృహిణిని మాయమాటలతో నమ్మించి.. లక్షలు కాజేశారు. కాప్రాకు చెందిన బాధితురాలి వాట్సాప్కు మార్చి నెలలో ఓమినికామ్ గ్రూప్ నుంచి యూట్యూబ్ లింక్లు క్లిక్ చేసి సబ్స్ర్కైబ్ చేయాలంటూ.. సందేశం వచ్చింది. ఒక్కో క్లిక్కు 50 చొప్పున మూడు క్లిక్లకు రూ.150 లాభ మంటూ ఆశపెట్టారు.
టెలీగ్రామ్ గ్రూప్లో ఆమె నంబర్ను యాడ్ చేసిన ఆగంతకులు.. ప్రీ పెయిడ్ టాస్క్లుంటాయని చెప్పి.. కొంత డిపాజిట్ చేయాలన్నారు. పలుదఫాలుగా మొత్తం రూ.39,27,400 పెట్టుబడి పెట్టించి.. మోసం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.