హైదరాబాద్ : మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో(టీన్యాబ్) ను ఏర్పాటు చేసిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్, టీన్యాబ్ డైరెక్టర్ సీవీ ఆనంద్ (CV Anand) తెలిపారు. ఈ ఏడాది మే 31వ తేదీన టీన్యాబ్ను బంజారాహిల్స్లోని కమాండ్ అండ్ కంట్రోల్లో ప్రారంభించిందని తెలిపారు. ఎన్డీపీఎస్(NDPS) కేసులకు సంబంధించి రాష్ట్ర నోడల్ ఏజెన్సీగా టీన్యాబ్ పనిచేస్తూ కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతుందని వెల్లడించారు.
గురువారం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో టీన్యాబ్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్, జులై నెలల్లో టీన్యాబ్ 196 కేసులు నమోదు చేయగా అందులో 175 కేసులు గంజాయికి సంబంధించిన కేసులున్నాయని వివరించారు. ఈ కేసులో 353 మందిని అరెస్ట్ చేయగా, ఎండీఎంఏ, హేరాయిన్, కొకైన్, ఓపీయం తదితర 21 డ్రగ్ కేసులలో 46 మందిని అరెస్ట్( Arrest ) చేసినట్లు వివరించారు. ఆయా కేసులలో రూ. 26 కోట్ల విలువైన డ్రగ్స్ను సీజ్(Seize) చేసినట్లు వెల్లడించారు.
డ్రగ్స్కు దూరంగా ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులు ‘మిషన్ పరివర్తన్’ (Mission Parivartan) పేరుతో జూన్ నెలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. రెండేండ్ల నుంచి తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు చేస్తున్న కృషి, మాదక ద్రవ్యాల రాష్ట్రం నుంచి పూర్తిగా నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు.
డ్రగ్స్ విక్రయాలలో అమ్మకందారులు, వినియోగదారుల మధ్య చైన్ లింక్ తెగగొట్టడం అందుకు ఆయా డ్రగ్ ఫెడ్లర్స్ నెట్వర్క్ను గుర్తించేందుకు కావాల్సిన టెక్నాలజీని వాడుతున్నామని సీవీ ఆనంద్ తెలిపారు. కేసుల పర్యవేక్షణ, ఎస్ఏఎఫ్ఈఎంఏ చట్టం కింద చర్యలు, డయల్ 100కు వచ్చే కాల్స్ రీరూటింగ్, యాంటీ డ్రగ్ కమిటీల బలోపేతం వంటి విషయంపై టీన్యాబ్కు కొత్తగా వచ్చిన సిబ్బంది, అధికారులకు సీపీ వివరించారు.