హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈక్రమంలో ముగ్గురి వద్ద అక్రమంగా తరలిస్తున్న 7 కిలోల బంగారాన్ని గుర్తించారు. దీంతో గోల్డును స్వాధీంనం చేసుకుని సీజ్ చేశారు. బంగారాన్ని కడ్డీల రూపంలో తరలిస్తున్నారని, దాని విలువ రూ.3.50 కోట్లకుపైగా ఉంటుందని అధికారుల వెల్లడించారు. ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచామరిస్తున్నామని తెలిపారు.