RGIA | హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో బంగారం పట్టుబడింది. దుబాయి నుంచి ఎమిరేట్స్ విమానంలో హైదరాబాద్ చేరుకున్న ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అతని వద్ద 206 గ్రాముల బంగారాన్ని గుర్తించి సీజ్ చేశారు.
ఈ బంగారాన్ని దుబాయి నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలించినట్లు అధికారులు నిర్ధారించారు. బంగారాన్ని పాప్కార్న్ తయారు చేసే యంత్రంలో దాచి తెచ్చాడు ప్రయాణికుడు. పట్టుబడ్డ బంగారం విలువ రూ. 12.57 లక్షల విలువ చేస్తుందని అధికారులు తెలిపారు. ప్రయాణికుడిని శంషాబాద్ పోలీసులకు అప్పగించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.