Moosapet | మూసాపేట, మే17: ఇంట్లోకొచ్చిన వరద నీటిని తోడే క్రమంలో ఓ బాలుడు కరెంట్ షాక్కు గురై.. చికిత్స పొందుతూ చనిపోయాడు. కూకట్పల్లి సీఐ కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి ప్రశాంత్నగర్ పరిధి ఇందిరానగర్కు చెందిన మహ్మద్ పాషా, నజీమబేగం దంపతులు గుడిసెలో నివాసముంటున్నారు.
వీరికి ముగ్గురు సంతానం. గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి గుడిసెలోకి వరద నీరు చేరింది. దీంతో కుమారుడు షాదుల్లా ఇమ్రాన్(11) వరద నీటిని తోడేందుకు మోటర్ ఆన్ చేసే క్రమంలో విద్యుత్ఘాతానికి గురయ్యాడు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.