వ్యవసాయ యూనివర్సిటీ , సెప్టెంబర్ 1 : దేశంలో నూనె గింజల సాగు మరింత పెరుగాలని ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ రమేశ్ చందర్ అగర్వాల్ అన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి మానవ వనరులు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ ( నార్మ్ ) చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. బుధవారం నార్మ్ వ్యవస్థాపక దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిసూ.్త. దేశంలో ప్రస్తుతం రూ .70 వేల కోట్ల విలువ చేసే వివిధ వంట నూనెలను దిగుమతులు చేసుకుంటున్నట్లు చెప్పారు. దిగుమతిని తగ్గించేందుకు నిరుపయోగంగా ఉన్న 26 మిలియన్ హెక్టార్ల భూమిలో నూనె గింజల సాగు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నార్మ్ డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏడాది కాలంలో నార్మ్లో అనేక కార్యక్రమాలు చేపట్టి వ్యవసాయ విద్య, శిక్షణ, పరిశోధన కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేశామన్నారు .కార్యక్రమంలో ఏడీజీ(హెచ్ఆర్డీ) డాక్టర్ సీమబగ్గీ తదితరులు పాల్గొన్నారు.