మేడ్చల్, డిసెంబర్ 26 : వానాకాలం పంటతో పాటు యాసంగిలోనూ రైతన్న వరివైపు మొగ్గు చూపుతున్న పరిస్థితులు కల్పిస్తున్నాయి. వర్షాలు విస్తారంగా కురిసి, నీటికి కొరత లేకపోవడంతో మెజార్టీ రైతులు వరి పంటనే సాగు చేయడానికే సన్నద్ధం అవుతున్నారు. ఈ యేడు మేడ్చల్ వ్యసాయ డివిజన్లో సాధారణ సాగుకు దాదాపు రెట్టింపు సాగయ్యే అవకాశం ఉందని అధికారులు అంచ నా వేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వరి సాగు ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో అన్నదాతలు వరి పంట సాగునే ఎంచుకునే అవకాశం కల్పిస్తోంది.
పెరగనున్న సాగు విస్తీర్ణం
వానా కాలంలో సాధారణ వర్షం పాతానికి మించి భారీగా వర్షాలు కురవడంతో చెరువులు నిండు కుండల ను తలపిస్తున్నారు. డిసెంబర్ పూర్తి కావస్తున్నా చెరువు లు, కుంటల్లో నీటి మట్టం తగ్గలేదు. భూగర్భ జలాలు పెరగడంతో బోర్లు పుష్కలంగా నీటిని అందిస్తున్నాయి. దీంతో సాగు విస్తీర్ణం కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. యాసంగి సాధారణ విస్తీర్ణం 13,827 ఎకరాలు ఉండగా, గతేడాది 14,082 ఎకరాలు సాగైతంది.ఈ సారి 19,756 ఎకరాల్లో పలు పంటలు సాగయ్యే అవకాశం ఉందని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
13,600 ఎకరాల వరి సాగు
చెరువుల్లో నీరు పుష్కలంగా ఉంటే రైతు ఎంచుకునేది సాధారణంగా వరి పంటనే. నగర శివారులో మేడ్చల్ డివిజన్ ఉన్నా కూరగాయల పంటల విస్తీర్ణం తగ్గింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, వెంట వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుండటంతో రైతు వరి లాభసాటిగా ఉంటుందని భావిస్తున్నారు. యాసంగిలో వరి సాధారణ విస్తీర్ణం 9206 ఎకరాలు ఉండగా గతేడాది యాసంగంలో 7904 ఎకరాలు సాగైంది. కానీ ఈ సారి 13వేల ఎకరాల పై చిలుకు వరి సాగవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొదించారు. గత యాసంగి మాదిరిగానే ఈ సారి కూడా ఆకు కూరలు, కూర గాయలు, పశు గ్రాసం సాగు బాగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. నారుమళ్లను రైతులు సిద్ధం చేసుకున్నారు. రానున్న నెల రోజుల్లో నాట్లు పూర్తయ్యే అవకాశం ఉంది. వివిధ పంటల ప్రతిపాదిత సాగు వివరాలు ఇలా ఉన్నాయి.
వాణిజ్య పంటలు సాగు చేయాలి
రైతులు వరి సాగుకు బదు లు వాణిజ్య పంటలు, కూరగాయల పంటలుసాగు చేయాలి. నగరానికి దగ్గరగా ఉన్నందున మార్కెటింగ్ ఇబ్బంది ఉండ దు. కూరగాయలకు డిమాండ్ కూడాఅధికంగా ఉంది. దీంతో రైతులు అధిక లాభాలు పొంది, ఆర్థికంగా నిలుదొక్కుకునే అవకాశం ఉంటుంది. రైతులు ఈ దిశగా ఆలోచించాలి. పంటలు సాగు చేసే రైతులకు సంపూర్ణంగా సహకారం అందిస్తాం. -వెంకట్ రాంరెడ్డి, ఏడీఏ, మేడ్చల్