సిటీబ్యూరో, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): గత వారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్రపతి అనంతరం తిరిగి ఢిల్లీ వెళ్లిపోయారు. మంగళవారం రాష్ట్రపతి నిలయంలోకి పర్యాటకులకు అనుమతి ఇవ్వడంతో ఉత్సాహంగా తరలివచ్చారు.
సుమారు 1000 మంది వరకు విజిటర్స్ రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అయితే నేటి నుంచి సందర్శకుల తాకిడి పెరగనున్నట్లు వివరించారు.