బంజారాహిల్స్, జూన్ 21: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్న వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నాయకులు గెల్లు శ్రీనివాస్యాదవ్, సీహెచ్ ఉపేంద్ర, కాల్వ నితీష్ డిమాండ్ చేశారు. ఈమేరకు ఆదివారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం వారు మాట్లాడుతూ.. మేడ్చల్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సాయి కిశోర్ ఇటీవల సోషల్ మీడియాలో కేటీఆర్ మీద తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారన్నారు.
కాంగ్రెస్ పార్టీ నేతలకు వ్యతిరేకంగా చిన్నచిన్న కామెంట్స్ పెట్టిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను కేసుల పేరుతో వేధిస్తున్న పోలీసులు.. కాంగ్రెస్ నాయకులు ఇతర పార్టీ నేతలపై చేస్తున్న వ్యాఖ్యలపై చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. బీఆర్ఎస్ నాయకులు కే. అక్షయ్కుమార్, నర్సింహులు, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.