హైదరాబాద్: భారీ మొత్తంలో విదేశీ కరెన్సీతో విదేశాలకు వెళ్తూ ఒక ప్రయాణికుడు అడ్డంగా బుక్కయ్యాడు. హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఈ ఘటన వెలుగు చూసింది. విమానాశ్రయంలో విదేశీ కరెన్సీతో ప్రయాణిస్తున్న ప్రయాణికుడిని అధికారులు పట్టుకున్నారు.
షార్జాకు వెళ్తున్న సదరు ప్రయాణికుడి వద్ద రూ.34.49 లక్షల విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని నసీర్ (24)గా గుర్తించిన సీఐఎస్ఎఫ్ అధికారులు.. అతన్ని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.